అకాల వర్షంతో అన్నదాతలపై తీవ్ర ప్రభావం.. కల్లాలలో తడిసిన ధాన్యం, మిరప.. మరో రెండు రోజులపాటు వర్షాలు
చల్లని వెదర్తో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినా.. అకాల వర్షం అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతులను కోలుకోనీయకుండా చేసింది.
చల్లని వెదర్తో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినా.. అకాల వర్షం అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతులను కోలుకోనీయకుండా చేసింది. సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పడ్డ వానలకు పంటలు దెబ్బతిన్నాయి. మహబూబ్నగర్లో అకాల వర్షానికి పంట నష్టం బాగా జరిగింది. కల్లాలపై ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వనపర్తిలోని కొత్తకోట, ఆత్మకూరు, సూర్యపేట జిల్లాలోని పలు చోట్ల వరంతో పాటు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్, కరీంనగర్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పంటలపై వరుణుడు ప్రతాపం చూపాడు. వరితో పాటు మామిడి వంటి కమర్షియల్ క్రాప్లు దెబ్బతిన్నాయి. టార్పలిన్లతో వరిని కాపాడుకునే యత్నం చేసినా.. చాలాచోట్ల పంట తడిసిముద్దయింది. దీంతో నిండా మునిగిన అన్నదాతలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పలు ప్రాంతాలలో కల్లాలలో ఉన్న మిర్చి పంట కూడా తడిసిపోయింది.
ఇక.. రానున్న రెండురోజుల పాటు ఇదే తరహా వెదర్ రిపోర్ట్ ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. ఉరుములు మెరుపులతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడుతుందని హెచ్చరించింది. వడగండ్ల వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటోంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఉరుములతో రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన పడగా.. ప్రస్తుతం కూల్గా మారింది. వర్షసూచన నేపథ్యంలో మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వేసవి తాపంతో అల్లాడుతున్న నగర ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
Also Read: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు… ప్రాణభయంతో పరుగో పరుగు
ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు