Crime News: పాతబస్తీలో వ్యక్తి హల్చల్.. భూ వివాదంపై చాయ్ కేఫ్లో చర్చ.. అంతలోనే గన్ తీసి తలపై గురిపెట్టి..
Crime News: హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గన్తో హల్ చల్ చేశాడు. స్థల వివాదం నేపథ్యంలో ఆయుబ్ ఖాన్ ..
Crime News: హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి గన్తో హల్ చల్ చేశాడు. స్థల వివాదం నేపథ్యంలో ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తిని జకీర్ గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం సాహెబ్ నగర్లోని ఒక ఎకరం 38 గుంటల భూమి విషయంలో ఆయుబ్ ఖాన్, జకీర్ మధ్య వివాదం నడుస్తోంది. అయితే, డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేఫ్లో కూర్చొని ఇద్దరూ చర్చించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దాంతో జకీర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని లోడ్ చేసి ఆయుబ్ ఖాన్ను బెదిరించాడు. తలపై గురిపెట్టి అతన్ని చంపేందకు యత్నించాడు.
అయితే ఈ ఘటనతో హోటల్లోని కస్టమర్లు, హోటల్ యజమాని ఉలిక్కి పడ్డారు. డబీర్పురా పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాకి స్థలానికి చేరుకుని జకీర్ను అదుపులోకి తీసుకున్నారు. జకీర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు పోలీసులు తేల్చారు. ఈ తుపాకీని ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్లో కొనుగోలు చేసినట్లు జకీర్ పోలీసులకు వివరించాడు. భూవివాదం నేపథ్యంలో ఆయుబ్ను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు విచారణలో జకీర్ వెల్లడించాడు. జకీర్పై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ప్రస్తుత ఘటనలో నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
Also read: