లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం- మల్లు రవి
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికలు జరిగిన తీరుపై గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హిట్లర్లా వ్యవహరిస్తున్నారని.. ఆయన నియంతృత్వానికి అడ్డుకట్టవేస్తేనే అందుబాటులోకి వస్తారని ప్రజలంతా భావించారన్నారు. అందుకే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందంటూ కేసీఆర్, కేటీఆర్, కవితతో సహా ఆ […]
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎన్నికలు జరిగిన తీరుపై గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హిట్లర్లా వ్యవహరిస్తున్నారని.. ఆయన నియంతృత్వానికి అడ్డుకట్టవేస్తేనే అందుబాటులోకి వస్తారని ప్రజలంతా భావించారన్నారు. అందుకే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేశారని ఆయన అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తోందంటూ కేసీఆర్, కేటీఆర్, కవితతో సహా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితాలు ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మల్లు రవి అన్నారు.