CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

ముఖ్యమత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు.

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
Cm Revanth Reddy With Union Ministers
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 13, 2024 | 8:18 PM

తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సహా పలు కొత్త రైల్వే లైన్ అంశాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ‌లోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం(డిసెంబర్ 13) నిర్మల సీతారామన్‌తో సమావేశమైన రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై చర్చించారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌లోని తొమ్మిది జిల్లాల‌కు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌లకు అంగీక‌రించినా.. కొన్నేళ్లుగా వాటిని విడుదల చేయలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్‌లోని హైకోర్టు, రాజ్ భ‌వ‌న్‌, లోకాయుక్త, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, జ్యుడీషియ‌ల్ అకాడ‌మీ స‌హా ఇత‌ర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భ‌రించిందని సీఎం రేవంత్ కేంద్రమంత్రికి వివరించారు. ఆయా సంస్థల విభ‌జ‌న పూర్తయ్యే వరకు నిర్వహణకు అయిన రూ.703.43 కోట్లను ప్రభుత్వమే భరించిందని, అందులో ఏపీ వాటా రూ.408.49 కోట్లను ఇప్పించాలని కోరారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని జ‌నాభా ప్రాతిప‌దిక‌న రావాలని మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణ‌కు రూ.495.20 కోట్లు స‌ర్దుబాటు చేయాల్సి ఉంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ఆయనతో చర్చించారు. వికారాబాద్‌ – కృష్ణా స్టేష‌న్ మ‌ధ్య కొత్త రైలు మార్గం, క‌ల్వకుర్తి – మాచర్ల మధ్య నూత‌న రైలు మార్గం మంజూరు చేయాల‌ని కోరారు. డోర్నకల్ – మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని రైల్వేమంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది