యువ జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
కరోనా మహమ్మారి కాటుకు ఆదివారం నాడు యువ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మాదన్నపేటకు చెందిన మనోజ్.. పలు టీవీ ఛానెళ్లలో రిపోర్టర్గా విధులు నిర్వర్తించారు.
కరోనా మహమ్మారి కాటుకు ఆదివారం నాడు యువ జర్నలిస్టు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని మాదన్నపేటకు చెందిన మనోజ్.. పలు టీవీ ఛానెళ్లలో రిపోర్టర్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానెల్లో క్రైం రిపోర్టర్గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం మరణించారు. జర్నలిస్ట్ మనోజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మనోజ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా తన అధికారిక ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. యువ జర్నలిస్ట్ మృతి తీవ్ర మనోవేదన కలిగించిందని.. మనోజ్ను బతికించేందుకు గాంధీ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారని.. అయినప్పటికీ కాపాడలేకపోయారంటూ ట్విట్టర్లో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ పేర్కొన్నారు.