TRS vs Congress: టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే, జెడ్పీటీసీ..!
TRS vs Congress: తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. అప్పుడే నేతల కప్పదాట్లు ప్రారంభమయ్యాయి.
TRS vs Congress: తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. అప్పుడే నేతల కప్పదాట్లు ప్రారంభమయ్యాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు ఇద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా, రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు తాటి వెంకటేశ్వర్లు. జిల్లాలో పార్టీ పరిస్థితి అద్వాన్నంగా ఉందని, అధిష్టానం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గురువారం నాడు కరకగూడెం టీఆర్ఎస్ జెడ్పీటీసీ కాంతారావు.. పార్టీకి చేశారు. కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు ఇద్దరూ నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక టీఆర్ఎస్ హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు టీఆర్ఎస్ నేతలు సైతం ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.