CM KCR: ఉద్యోగులపై దాడులు సహించం.. ఫారెస్ట్ రేంజర్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..

శ్రీనివాసరావు హత్య పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకుంటుందని అధైర్య పడవద్దంటూ భరోసా ఇచ్చారు.

CM KCR: ఉద్యోగులపై దాడులు సహించం.. ఫారెస్ట్ రేంజర్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..
Cm Kcr
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:55 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని దట్టమైన అడవిలో ఉంటుందీ ఎర్రబోడు. గూగుల్ మ్యాప్‌లో వెతికినా ఈ గ్రామం ఆచూకీ దొరకదు. కానీ ఇక్కడ 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గట్టిగా మాట్లాడితే వంద మందికి ఈ ఎర్రబోడు ఆవాసం. వీళ్లంతా 25 సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ నుంచి వలస వచ్చిన వాళ్లే. వీరంతా పోడు సాగు చేసుకొని జీవనం సాగు చేస్తున్నారు. అన్ని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పోడు సమస్య కొనసాగుతూనే ఉంది. అటవీ భూములను నరికి వ్యవసాయం చేయడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం దారుణాతి దారుణం. ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై.. గుత్తి కోయలు దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం ఈర్లపూడి ఆయన స్వగ్రామం. శ్రీనివాస్ మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రభుత్వం అండగా ఉంటుంది.. సీఎం కేసీఆర్

శ్రీనివాసరావు హత్య పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకుంటుందని అధైర్య పడవద్దంటూ భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని, ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. సీఎం డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

శ్రీనివాసరావు అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. అటవీశాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అంత్యక్రియలకు హాజరుకావాలని.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

పోడు భూముల వివాదాలు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. పోడు రైతులు, అటవీ అధికారుల మధ్య ఎప్పటినుంచో వివాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదు. ఏకంగా ఫారెస్ట్ అధికారినే కత్తులతో నరికి చంపిన ఘటనలు మాత్రం ఎక్కడా లేవు. కానీ ఫస్ట్ టైమ్ ఇలా జరగడంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..