Political War: టీ కాంగ్రెస్లో కొత్త వివాదం.. షబ్బీర్ అలీని సస్పెండ్ చేయాలని ప్రియాంకకులేఖ.. ఎందుకంటే..
స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు గా చేశారు..కానీ రేవంత్ రెడ్డి పీసిసి చీఫ్గా ఎన్నికైనప్పటి నుండి షబ్బీర్ అలీ రేవంత్కి సన్నిహితుడిగా..
తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త వివాదం మొదలైంది.. అందరూ కలిసి మునుగోడు పై ఫోకస్ చేస్తున్న తరుణంలో కొత్త వివాదం పార్టీలో గందరగోళం రేపుతోంది..మళ్లీ ఏమైందనుకుంటున్నారా. స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు గా చేశారు..కానీ రేవంత్ రెడ్డి పీసిసి చీఫ్ గా ఎన్నికైనప్పటి నుండి షబ్బీర్ అలీ రేవంత్ కి సన్నిహితుడిగా ముద్ర పడింది.. వీరి వివాదం ఇక్కడే మొదలైంది.. పీసీసీ విషయంలో కోమటిరెడ్డి కి షబ్బీర్ మద్దతు తెలపలేదు..ప్రస్తుతం ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కన్వీనర్ గా కూడా కొనసాగుతున్నారు.. కోమటిరెడ్డి గాంధీ భవన్ లో జరిగే సమావేశాలకు ఏనాడు కూడా హాజరుకాకపోగా ఆరు సార్లు ఓడిపోయిన వాళ్లు సమావేశాలు పెడితే..తాము అటెండ్ అవ్వాలా..అని షబ్బీర్ అలీపై కామెంట్లు చేశారు. అప్పటి నుంచీ వీరి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
అయితే.. తాజాగా షబ్బీర్ అలీని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అగ్రనేత ప్రియాంక గాంధీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడం తో వివాదం మరింత ముదిరింది.. షబ్బీర్ అలీతో పాటు, మాజీ ఐపిఎస్ అధికారి పై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి..త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకుపోతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. షబ్బీర్ అలీపై క్రమశిక్షణ సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత జరిగిన వివాదం అనంతరం.. ప్రియాంక గాంధీ తో సమావేశమైన వెంకటరెడ్డి కొద్దిరోజులు సైలెంట్గానే ఉన్నారు. ఇక కోమటిరెడ్డి కూల్ అయ్యారని అందరూ అనుకున్నారు. మునుగోడు ప్రచారంలో దిగుతారనుకున్నారు. ఈలోగానే..రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న షబ్బీర్అలీని టార్గెట్ చేయడంతో..కథ మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.
ఇప్పుడీ సరికొత్త వివాదం ఎంత దూరం వెళ్తుందో.. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారో రారో..ఇంకెన్ని బాంబులు పేల్చుతారోనని గాంధీభవన్ టాక్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం