Vikarabad Accident: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. ప్రమాదం తీరుపై పోలీసుల ఆరా..

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో పదిమందికి గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే..

Vikarabad Accident: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. ప్రమాదం తీరుపై పోలీసుల ఆరా..
Vikarabad Bus Accident
Follow us

|

Updated on: Nov 20, 2022 | 1:34 PM

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో పదిమందికి గాయాలయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వికారాబాద్ డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు.. తాండూరు నుంచి వికారాబాద్ కు వస్తోంది. అనంతగిరి గుట్ట సమీపంలో ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడి పోయింది. దీంతో బస్సులో జర్నీ చేస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో పదిమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

మరోవైపు.. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఆటో – లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి, సరస్వతి, ప్రేమ్‌కుమార్‌ లు కొండాపురం మండలం దత్తాపురం వచ్చారు. కొన్ని రోజులుగా సరస్వతికి అనారోగ్యంగా ఉండడంతో తాయత్తు కట్టించుకొని ఆటోలో తిరిగి పయనమయ్యారు. కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో ఆటో ప్రయాణిస్తున్న సమయంలో ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. లారీ అదుపు తప్పడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..