Telangana: ఘోర ప్రమాదం.. ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు..

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మంటలు దట్టగా ఎగసిపడుతున్నాయి. ప్రమాద..

Telangana: ఘోర ప్రమాదం.. ట్రావెల్ బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు..
Fire Accident
Follow us

|

Updated on: Nov 15, 2022 | 6:41 AM

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మంటలు దట్టగా ఎగసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో బయటకు దూకి ప్రయాణికులుు ప్రాణాలు కాపాడుకున్నారు. మంటలు ఎగసిపడుతుండటంతో ప్రయాణికుల సామాగ్రి కాలి బూడిదైంది.

బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. బాధితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటనతో ప్రయాణీకులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు దక్కించుకునేందుకు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా.. ఇటీవలి కాలంలో ప్రైవేటు బస్సుల ప్రమాదాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. దీనిపై ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..