Telangana: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు.. గేదెను తప్పించబోయి..
గేదెను తప్పించబోయి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో 36 మంది ప్రయాణికులు ఉన్నారు..
Narayanpet District: తెలంగాణలోని నారాయణ పేట్ (మహబూబ్ నగర్) జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని మాగనూరు (maganur) వద్ద చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గేదెను తప్పించబోయి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ వేగంగా వస్తున్న క్రమంలో గేదె అడ్డు వచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read:
Axis Bank: పొదువు ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..