రాష్ట్రం ఇచ్చినా రెండుసార్లు ఓడిపోయాం.. సోనియాకు టీకాంగ్రెస్ లేఖ
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆపార్టీ సీనియర్ నేతలు. ఈమేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్పటికీ రెండు సార్లు ఓటమిపాలయ్యామని తెలిపారు. నమ్మకున్నవాళ్లకు టికెట్లు కేటాయించలేకపోవడం, ప్యారాచూట్ నేతలు ప్రోత్సహించడంతోనే ఓటమి పాలయ్యామని సోనియాకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన నైరాశ్యం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహుల్ రాజీనామా తర్వాత పార్టీలో అనిశ్చితి నెలకొందని తెలిపారు. […]
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆపార్టీ సీనియర్ నేతలు. ఈమేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ప్పటికీ రెండు సార్లు ఓటమిపాలయ్యామని తెలిపారు. నమ్మకున్నవాళ్లకు టికెట్లు కేటాయించలేకపోవడం, ప్యారాచూట్ నేతలు ప్రోత్సహించడంతోనే ఓటమి పాలయ్యామని సోనియాకు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం పార్టీలో తీవ్రమైన నైరాశ్యం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహుల్ రాజీనామా తర్వాత పార్టీలో అనిశ్చితి నెలకొందని తెలిపారు. వీలైనంత త్వరగా ఏఐసీసీకి అధ్యక్షుణ్ని నియమించాలని సోనియా గాంధీని ఆ లేఖలో కోరారు. పార్టీలో తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన నిరాశ వెంటాడుతోందని పేర్కొన్నారు. వెంటనే జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సోనియాను కోరారు. కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, వీహెచ్,కోదండ రెడ్డి, కమలాకర్రావు,చంద్రశేఖర్, శ్యామ్ మోహన్, నిరంజన్ తదితరులు ఈ లేఖను రాశారు.