టెన్త్ పరీక్షలు.. కొత్త కేంద్రాలపై ముందు రోజు ‘మెసేజ్’లు..!
కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 9 నుంచి జూలై 5 వరకు జరగనున్న విషయం తెలిసిందే.
కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 9 నుంచి జూలై 5 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు మెసేజ్లు చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకే పరీక్షల ముందు విధ్యార్థులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలు చూసుకుంటే పరీక్ష రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని తెలిపారు.
జూన్ 7 నుంచే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంచుతామని అన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని, ఈ క్రమంలో అదే రోజు వెళ్లినా సమీపంలోని(కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చని ఆయన అన్నారు. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కాస్త ఆలస్యమైనా అనుమతిస్తామని అన్నారు. ఇక కరోనా జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్ష సెంటర్ల వద్ద పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా కరోనా జాగ్రత్తల్లో భాగంగా ముఖానికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు ఉంటేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాలను అనుమతించనున్నట్లు తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.
Read this Story Also: మొదటి రోజే చంద్రబాబుకు షాక్.. కేసు నమోదు..!