టీడీపీ, కాంగ్రెస్లకు భారీ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పెద్ది రెడ్డి, బోడ జనార్ధన్లు, మరో సీనియర్ నేత చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మైనార్టీ నేత షేక్ రహ్మతుల్లా కమలం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో వీరంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, […]
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు పెద్ది రెడ్డి, బోడ జనార్ధన్లు, మరో సీనియర్ నేత చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మైనార్టీ నేత షేక్ రహ్మతుల్లా కమలం గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో వీరంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది పార్టీలో చేరబోతున్నారని వారు తెలిపారు.
Delhi: TDP leaders E Peddi Reddy, Bode Janardhan and Suresh Reddy & Congress leaders Shashidhar Reddy and Sheik Rahmatullah join BJP. pic.twitter.com/rW39fyHiVl
— ANI (@ANI) June 27, 2019