TS Promotions: ఈనెల 31 లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి.. అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశం
TS Promotions: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 31వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ...
TS Promotions: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 31వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా జరుగుతున్న పదోన్నతులపై సమీక్షించారు. ప్రమోషన్ల విషయంలో అత్యంత ప్రాధాన్యత గల అంశమని, ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అలాగే వివిధ కేటగిరీలలో ఏర్పడిన పదోన్నతుల ఖాళీలను భర్తీ చేయడంలో ఎదురవుతున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పదోన్నతులపై శాఖాధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశానికి కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్ కార్యదర్శి రామకృష్ణారావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీ జితేందర్, కార్యదర్శులు ఎస్ఏఎం రిజ్వీ, బి. వెంకటేశం, సందీప్ కుమార్ సుల్తానియా, జనార్ధన్రెడ్డి, అహ్మద్ నదీమ్, అనిల్ కుమార్, దివ్య, నీతుప్రసాద్, క్రిస్టినా చోంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు.