మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో కరోనా చికిత్స..నేటి నుంచే అందుబాటులోకి..

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వైరస్ పంజా విసురుతోంది. మొన్నటి దాకా ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలను

మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో కరోనా చికిత్స..నేటి నుంచే అందుబాటులోకి..
Follow us

|

Updated on: Jul 06, 2020 | 6:43 PM

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వైరస్ పంజా విసురుతోంది. మొన్నటి దాకా ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆదివారం ఒక్కరోజే.. 5290 శాంపిళ్లను పరీక్షించగా.. 1590 పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23,902 కరోనా కేసులు నమోదు కాగా.. 295 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

తెలంగాణ రాష్రంలో 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా బారినపడ్డ బాధితులకు చికిత్స అందించనున్నారు. ఇవాళ్టి నుంచే ఆయా కాలేజీల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని మమత, మల్లారెడ్డి, దక్కన్, కామినేని, ఆర్వీఎం మెడికల్ కాలేజీలు, ఖమ్మంలో మమత, కరీంనగర్‌లో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీలతో పాటు నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతానికి పడకలు సిద్ధం కాగా, మరికొన్ని మెడికల్ కాలేజీలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.