నూతన సచివాలయానికి రేపే భూమిపూజ
తెలంగాణ నూతన సచివాలయం,అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ రేపు ఉదయం భూమి పూజ,శంకుస్ధాపనలు చేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న గార్డెన్లో భూమిపూజ చేయనున్నారు. ఆతర్వాత ఎర్రమంజిల్లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది . ఈ రెండు నిర్మాణాలను అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, […]
తెలంగాణ నూతన సచివాలయం,అసెంబ్లీ భవనాలకు సీఎం కేసీఆర్ రేపు ఉదయం భూమి పూజ,శంకుస్ధాపనలు చేయనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రస్తుతం ఉన్న ప్రాంగణంలోనే డీ బ్లాక్ వెనుకవైపు ఉన్న గార్డెన్లో భూమిపూజ చేయనున్నారు. ఆతర్వాత ఎర్రమంజిల్లో అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి సీఎం శంకుస్ధాపన చేయనున్నారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది .
ఈ రెండు నిర్మాణాలను అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే పాత భవనాన్ని ఒకేసారి కూల్చివేయకుండా విడతల వారీగా కూల్చివేసి పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట ఏ, బీ, సీ బ్లాక్లలోని కార్యాలయాలను ఎల్, జే, డీ బ్లాక్లకు తరలించి.. ఏ,బీ,సీ,కే బ్లాక్లను కూల్చివేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నూతన సచివాలయం భారీ ఎత్తున నిర్మితమవుతున్న దృష్ట్యా అక్కడున్న భారీ వృక్షాలను వేరే చోట తిరిగి పాతిపెట్టేవిధంగా అధికారులు నిర్ణయించారు.