టీ సర్కార్ కొత్త పాలసీ.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక.. ఇసుక విషయంలో నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ఇంటికి ఇసుకను తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎంత ఇసుక కావాలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని.. డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. అయితే రవాణా చార్జీలతో కలుపుకొని టన్నుకు రూ.1350 నుంచి రూ.1450 వరకు ఖర్చు అవుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకే […]

టీ సర్కార్ కొత్త పాలసీ.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 1:16 PM

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక.. ఇసుక విషయంలో నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ఇంటికి ఇసుకను తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎంత ఇసుక కావాలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని.. డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. అయితే రవాణా చార్జీలతో కలుపుకొని టన్నుకు రూ.1350 నుంచి రూ.1450 వరకు ఖర్చు అవుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకే ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది.

ఖనిజాభివృద్ధి సంస్థ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఇసుక కావాల్సినవారు టీఎస్ఎండీసీకి చెందిన శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వెబ్‌సైట్‌‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుని.. ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు. ఇసుక సరఫరాకు నగర శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, బౌరంపేటల్లో ప్రత్యేకంగా స్టాకు యార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో 1.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి స్టాక్‌ యార్డుల్లో ఇసుకను నిల్వ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇసుక సరఫరాకు వీలుగా వాహనదారులతో ఎండీసీ ప్రత్యేకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది.

అయితే హైదరాబాద్‌‌లో అవసరాలకు నిజానికి లక్షల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 10 టన్నుల ఇసుకను ఎండీసీ సరఫరా చేసినా.. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణదారులకు ఊరటగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు ప్రతి వర్షాకాలంలో ఇసుక ధరలు పెరుగుతాయి. బ్రోకర్లు కొన్నిసార్లు టన్ను ఇసుకను ఏకంగా రూ.2,000 వరకు కూడా విక్రయిస్తారు. దీంతో వ్యక్తిగత నిర్మాణదారులకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. నూతన ఇసుక విధానం అమలైతే ఇసుక ధరల్లో మార్పు లేకుండా సరఫరా అయ్యే అవకాశం ఉంది.