తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇలా చాలా మంది..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇలా చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. కాగా వీరిలో పలువురు నాయకులు కరోనా బారి నుంచి ఇప్పటికే కోలుకున్నారు కూడా. అయితే సామాన్యులతో పాటు రాజకీయ నాయకులకు కూడా కోవిడ్ రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.
తాజాగా ఇప్పుడు తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. గత ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో మల్లా రెడ్డికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో వెంటనే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మల్లా రెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితమే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో సహా ఆయన భార్య, కుమారులకు కూడా కోవిడ్ సోకిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా 2256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరింది. ఇక నిన్న 1091 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం ఇప్పటివరకూ 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గరిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 615కి చేరింది.
Read More:
తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న కరోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య