బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కొప్పుల
కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆలయ మర్యాదలతో ఈవో సురేష్బాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం కొప్పుల ఈశ్వర్కు వేద పండితులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బెజవాడ దుర్గమ్మ ఎంతో మహిమ గల తల్లి అని చెప్పారు. తాము ఎప్పటి నుంచో ప్రతీయేటా ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా […]
కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆలయ మర్యాదలతో ఈవో సురేష్బాబు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం కొప్పుల ఈశ్వర్కు వేద పండితులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బెజవాడ దుర్గమ్మ ఎంతో మహిమ గల తల్లి అని చెప్పారు. తాము ఎప్పటి నుంచో ప్రతీయేటా ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని, సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేశంలోనే ఆదర్శవంతమైన పాలనతో అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆశించారు.