హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రాజకీయ కుట్ర, దురుద్దేశాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని అశోక్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు డేటా చౌర్యం కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది.
Breaking News
- మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
- ఒక్క బెల్ట్షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్ రూమ్లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్ కూడా కుదించాం-జగన్. లిక్కర్ రేట్లు షాక్ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్.
- గుంటూరు: మైనర్ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
- ఆర్టీసీ విలీనంపై టైమ్బాండ్ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
- రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన.
- జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్. 43 వేల బెల్ట్ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్. ఒక్క బెల్ట్షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్. పర్మిట్ రూమ్లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్ కూడా కుదించాం-జగన్. లిక్కర్ రేట్లు షాక్ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్.