నిండిన చెరువులు.. దుంకిన మత్తళ్లు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది.

నిండిన చెరువులు.. దుంకిన మత్తళ్లు
Follow us

|

Updated on: Aug 16, 2020 | 11:08 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. అనేక చోట్ల వాగులు, చెరువులు,కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. పొలాలు, రోడ్లు, వాగులు, చెరువులు.. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా పట్టిన ముసురు వదలడంలేదు. గంటల తరబడి కురిస్తున్న వర్షానికి వరద పోటెత్తింది.

పొలం పనులకు వెళ్లిన కూలీలు వరద నీటిలో చిక్కుపోయారు. అటు, పశువులు మేపేందుకు పోయిన కాపర్లు, వంతెనలవద్ద వాహనదారులు నడుమ వరకు వచ్చిన నీళ్ల మధ్య చిక్కుకుని అవస్థలు పడ్డారు. వరదనీటితో పంట పొలాలు నీట మునిగాయి. వరినాట్లు మునిగి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు చెరువులను తలపించాయి. చెరువులు పూర్తిగా నిండి అలుగులుపొస్తున్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడతాయనే భయంతో చెరువు మత్తళ్లను తవ్వేశారు. పోటెత్తిన వరదలకు పలవురు గల్లంతయ్యారు. పలుచోట్ల మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని జిల్లాల్లోని ఉన్నతాధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాట్లు చేసి పర్యవేక్షించాలని సూచించింది.