ధ‌ర‌ణిలో కొత్త ఆప్ష‌న్‌… అప్లికేష‌న్ ఫ‌ర్ ల్యాండ్ మ్యాట‌ర్స్ పేరుతో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి అవ‌కాశం…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదును ధ‌ర‌ణి వెబ్ సైట్ ద్వారా చేప‌ట్టింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాప‌ర్టీస్...

ధ‌ర‌ణిలో కొత్త ఆప్ష‌న్‌... అప్లికేష‌న్ ఫ‌ర్ ల్యాండ్ మ్యాట‌ర్స్ పేరుతో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి అవ‌కాశం...
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2021 | 9:19 AM

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదును ధ‌ర‌ణి వెబ్ సైట్ ద్వారా చేప‌ట్టింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రిక‌ల్చ‌ర్ ప్రాప‌ర్టీస్ క‌లిగి ఉన్న వారిని త‌మ ఆస్తుల వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. అయితే తాజాగా ధరణిలో ‘అప్లికేషన్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌’ పేరుతో కొత్త ఆప్షన్‌ను జతచేసింది.

త‌ప్పులు స‌రిదిద్దుకునే అవ‌కాశం…

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అత్యధికశాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. పేర్లల్లో అక్షరదోషాలు, విస్తీర్ణం నమోదులో తేడాలు, వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి కొన్ని సమస్యలు మిగిలిపోయాయి. తాజాగా వీటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి తొలిగించడం, కంపెనీల భూముల రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలపై మీసేవ ద్వారా దరఖాస్తుకు అవకాశమిచ్చింది.

మార్పులు చేసుకోండిలా…

వినియోగదారులు ధ‌ర‌ణిలో ‘యూజర్‌ లాగిన్‌’లోకి వెళ్లిన తర్వాత డ్యాష్‌బోర్డులో అప్లికేష‌న్ ఫ‌ర్ ల్యాండ్ మ్యాట‌ర్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత పేరు, అడ్రస్‌వంటి వివరాలు నమోదుచేశాక.. దరఖాస్తు చేయాలనుకున్న భూమి సర్వేనంబర్‌ను నమోదుచేయాలి. అనంతరం అక్కడ కనిపించే సరిహద్దు వివాదం, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదం, ఇతర, పట్టాదార్‌ పాస్‌బుక్‌ (పీపీబీ)ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమస్యకు సంబంధించిన వివరణను కింద బాక్స్‌లో రాయాలి. చివరగా ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే అప్‌లోడ్‌ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కు వెళ్తుంది. కలెక్టర్‌ వాటిని పరిశీలించి.. అవసరమైతే విచారణ జరిపి వారంలో పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??