తెలంగాణ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేడు రూ.1,500..వారికి మాత్ర‌మే..

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 జమవుతాయని ట్విటర్ ద్వారా తెలిపారు. క‌రోనా సాయం కింద‌ తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు అర్హులైన‌ 74 లక్షల పైచిలుకు బ్యాంకు ఖాతాల్లో మంగ‌ళ‌వారం డబ్బులు క్రెడిట్ అవుతాయ‌ని వెల్ల‌డించారు. అందుకోసం ఆయా బ్యాంకులకు ఇప్పటికే రూ.1112 కోట్లు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ బ‌దిలీ చేసింద‌ని పేర్కొన్నారు. ఇక‌ రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు […]

తెలంగాణ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేడు రూ.1,500..వారికి మాత్ర‌మే..
Follow us

|

Updated on: Apr 14, 2020 | 7:48 AM

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 1500 జమవుతాయని ట్విటర్ ద్వారా తెలిపారు. క‌రోనా సాయం కింద‌ తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు అర్హులైన‌ 74 లక్షల పైచిలుకు బ్యాంకు ఖాతాల్లో మంగ‌ళ‌వారం డబ్బులు క్రెడిట్ అవుతాయ‌ని వెల్ల‌డించారు. అందుకోసం ఆయా బ్యాంకులకు ఇప్పటికే రూ.1112 కోట్లు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ బ‌దిలీ చేసింద‌ని పేర్కొన్నారు.

ఇక‌ రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉండ‌గా..వారిలో 87శాతం కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యింద‌ని చెప్పారు కేటీఆర్. 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ అద్భుతంగా పనిచేసిందని కేటీఆర్ కితాబిచ్చారు.