బిగ్ బ్రేకింగ్.. షాద్నగర్ ఎన్కౌంటర్పై సిట్ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్కౌంటర్పై తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో.. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్కౌంటర్పై తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో.. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సిట్లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు.. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసుల వివరాలను సిట్ సేకరించనుంది.
కాగా, సోమవారం ఉదయం తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్కౌంటర్పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ను ఏర్పాటుచేసింది.