తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. అమరవీరులకు నివాళులర్పించిన సీఎం
స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ.. మరో సంవత్సరంలోకి అడుగేయనుంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఇవాళ అమరవీరులకు నివాళులర్పించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం...
స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. మరో సంవత్సరంలోకి అడుగేయనుంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా వేడుకలు జరగనున్నాయి. ఇవాళ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు సీఎం కేసీఆర్. రెండు నిమిషాల పాటు ఆయన మౌనం పాటించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
అలాగే ప్రగతి భవన్లో కూడా జెండా ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్. కాగా ఇప్పటికే ప్రజా ప్రతినిధులందరూ వారికి సంబంధించిన కార్యాలయాల్లో 8.30లకే జాతీయ పతాకం ఆవిష్కరించారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలను నిర్వహించాలని పేర్కొంది తెలంగా ప్రభుత్వం. అంతేకాకుండా నేతలు, నాయకులు, కార్యకర్తలు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించి, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని సూచించింది తెలంగాణ సర్కార్.
ఇవి కూడా చదవండి: