రేపే ఎంసెట్ పరీక్ష ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు మంగళవారం విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు మంగళవారం విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆయన వివరించారు. ఫలితాలను రేపు మధ్య్నానం 3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా ప్రభావంతో లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ నిర్వహణ ఆలస్యమైంది. గత సెప్టెంబర్లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. తెలంగాణ, ఏపీలో 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1లక్ష43 వేల165 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపిన ఆయన.. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.
ఇక, తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్ వెబ్ ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవల్సి ఉంటుంది. ఈ 22న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్ 2న ఇంజినీరింగ్ తుది విడుత సీట్ల కేటాయిస్తామని కన్వీనర్ వివరించారు. నవంబర్ 4న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.