Breaking: తెలంగాణలో ఇవాళ వెయ్యికి పైగా కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,357 కు చేరింది. ఇవాళ మరో ఏడుగురు కరనాతో ప్రాణాలొదిలారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Breaking: తెలంగాణలో ఇవాళ వెయ్యికి పైగా కరోనా కేసులు
Follow us

|

Updated on: Jul 01, 2020 | 9:49 PM

తెలంగాణలో కరోనా విజృంభణ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,357 కు చేరింది. ఇవాళ మరో ఏడుగురు కరనాతో ప్రాణాలొదిలారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 788 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,082 కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 267కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,008 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 4,234 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 3,216 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా 881 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 33, మేడ్చచ్ లో 36, సంగారెడ్డిలో 2, కరీంనగర్ లో 2, మహబూబ్ నగర్ లో 10, వరంగల్ రూరల్ లో 9, సూర్యాపేట్ లో 2, ఖమ్మంలో 7, కామారెడ్డిలో 2, నల్గొండలో 4, సిద్దిపేటలో 3, ములుగులో 2, జగిత్యాలలో 4, మంచిర్యాలలో 9, అసిఫాబాద్ లో 2, మెదక్ లో 2, ఆదిలాబాద్ లో 2, యాదాద్రిలో 2, నిజమాబాద్ లో 3, గద్వాల జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి.