తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వాటిలో 37 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవ్వడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,551కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 21 మంది కరోనా రోగులు వ్యాధి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కోవిడ్-19 వల్ల ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 525 గా ఉంది. ఆదివారం రాత్రి వరకు […]
తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వాటిలో 37 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవ్వడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,551కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 21 మంది కరోనా రోగులు వ్యాధి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కోవిడ్-19 వల్ల ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 525 గా ఉంది. ఆదివారం రాత్రి వరకు మొత్తం 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.