తెలంగాణ కరోనా తాజా బులిటెన్ :జిల్లాల వారీగా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత అధికంగానే కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాగం ఎన్ని జాగ్రత్తలు తీసకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
Telangana corona news : తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత అధికంగానే కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాగం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 1,918 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో తెలిపింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 66,677కి చేరింది. కొత్తగా 10 మంది మరణించడంతో.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 540కి పెరిగింది. తాజాగా వ్యాధి బారి నుంచి 1,088 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 18,547 మంది చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 517 కేసుల నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ జిల్లాలో 146, వరంగల్ అర్బన్ జిల్లాలో 138, నిజామాబాద్ జిల్లాలో 131, సంగారెడ్డిలో 111 కేసులు నిర్దారణ అయ్యాయి.
Read More : గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్ఎంసీ యాప్’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు