ఆసుపత్రిలో చేరిన ముఖేష్ గౌడ్.. పరిస్థితి విషమం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైఎస్ హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైఎస్ హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముఖేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్కు ఆయన సమీప బంధువు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్, రెండుసార్లు ఓడిపోయారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన సమయంలోనే ఆయన పూర్తిగా చిక్కి శల్యం అయిపోయి కనిపించారు.