దేశానికే తెలంగాణ ఆదర్శం-కేసీఆర్

వరంగల్‌: సంక్షేమంతో పాటు అనేక కార్యక్రమాల్లో మనం దేశానికి తలమానికంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా అజంజాహీ మిల్లు మైదానంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడి ప్రజలేనని కొనియాడారు. వరంగల్‌ ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదన్నారు. చైతన్యవంతమైన […]

దేశానికే తెలంగాణ ఆదర్శం-కేసీఆర్
Follow us

|

Updated on: Apr 02, 2019 | 7:56 PM

వరంగల్‌: సంక్షేమంతో పాటు అనేక కార్యక్రమాల్లో మనం దేశానికి తలమానికంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా అజంజాహీ మిల్లు మైదానంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడి ప్రజలేనని కొనియాడారు. వరంగల్‌ ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదన్నారు. చైతన్యవంతమైన జిల్లా నుంచి స్ఫూర్తివంతమైన తీర్పు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో కూడా అగ్రభాగాన ఉండాలన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో ఇప్పుడు తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే నెల నుంచి రెట్టింపు చేసిన పెన్షన్లు ఇస్తామని తెలిపారు.