Breaking : తెలంగాణలో కరోనా కేసుల మోనటరింగ్ కోసం ప్రత్యేక అధికారులు
తెలంగాణలో కరోనా కేసుల మోనటరింగ్ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కోవిడ్ కేసులు, బెడ్స్, ల్యాబ్స్ వంటి విభాగాలను ప్రత్యేక అధికారులు కోఆర్డినేట్ చేయనున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల మోనటరింగ్ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కోవిడ్ కేసులు, బెడ్స్, ల్యాబ్స్ వంటి విభాగాలను ప్రత్యేక అధికారులు కోఆర్డినేట్ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా వివిధ మెడికల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి డాక్టర్లు, ప్రొఫెసర్లను ప్రత్యేక అధికారులుగా తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ప్రత్యేక అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
కాగా గ్రేటర్ పరిధిలో రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో కొత్తగా ఆయా ఏరియాల్లో పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో కూడా వసతులను బట్టి 20 నుంచి 50 బెడ్లను ఏర్పాటు చేసి స్థానికంగా రోగులను ఉంచి ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు. జంటనగరాల పరిధిలో రోజుకు దాదాపు 1,500 కేసులు నమోదవుతుండగా.. ఈ నెలాఖరుకు ఆ సంఖ్య రెట్టింపు కానుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది