తెలంగాణలో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్..
తెలంగాణలోని మహబూబ్నగర్లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి తండ్రితో పాటు నానమ్మకు కోవిడ్ సోకింది. తాజాగా చేసిన పరీక్షల్లో చిన్నారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం పసికందును గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లి వచ్చినవారి నుంచి కొత్తగా ఈ ముగ్గురికి కరోనా వైరస్ అంటుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లా వాసులలో భయాందోళనలు […]
తెలంగాణలోని మహబూబ్నగర్లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం చిన్నారి తండ్రితో పాటు నానమ్మకు కోవిడ్ సోకింది. తాజాగా చేసిన పరీక్షల్లో చిన్నారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం పసికందును గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లి వచ్చినవారి నుంచి కొత్తగా ఈ ముగ్గురికి కరోనా వైరస్ అంటుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లా వాసులలో భయాందోళనలు మొదలయ్యాయి. నిన్నటి వరకు మహబూబ్నగర్లో 7 కరోనా పాజిటివ్ కేసులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.