తెలంగాణ : టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించిన విద్యాశాఖ..
పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గ్రేడ్లు నిర్ణయించింది. ప్రభుత్వ సూచనల మేరకు ఇంటర్నల్ అసైన్మెంట్ మార్కుల ప్రాతిపదికన గ్రేడ్లు కేటాయించింది. www.bse.telangana.gov.in వెబ్ సైట్ లో గ్రేడ్ల వివరాలు పొందుపరిచారు అధికారులు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి గ్రేడ్ ల వివరాలు సదరు సైట్ లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పాస్ మెమోలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ద్వారా పొందవచ్చు. సమస్యలు ఉంటే ప్రధానోపాధ్యాయిని ద్వారా […]
పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గ్రేడ్లు నిర్ణయించింది. ప్రభుత్వ సూచనల మేరకు ఇంటర్నల్ అసైన్మెంట్ మార్కుల ప్రాతిపదికన గ్రేడ్లు కేటాయించింది. www.bse.telangana.gov.in వెబ్ సైట్ లో గ్రేడ్ల వివరాలు పొందుపరిచారు అధికారులు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి గ్రేడ్ ల వివరాలు సదరు సైట్ లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పాస్ మెమోలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ద్వారా పొందవచ్చు. సమస్యలు ఉంటే ప్రధానోపాధ్యాయిని ద్వారా ఎస్.ఎస్.సి బోర్డును సంప్రదించాలని అధికారులు తెలిపారు.