‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వారికి జియో బంపరాఫర్..!
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో చాలా టెలికం కంపెనీలు ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిలియన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 3 జీబీ డేటా, ఇతర జియో ల్యాండ్లైన్, మొబైల్ నంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఎస్ఎమ్ఎస్లు అందించనుంది. అంతేకాకుండా జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వారిని దృష్టిలో పెట్టుకొనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా జియో ఇప్పటికే రూ.599 రీఛార్జీతో రోజువారీ 2జీబీ డేటా, రూ.555 రీఛార్జీతో 1.5జీబీ డేటా ప్లాన్లను 84 రోజుల వ్యాలిటిడీతో వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
Read This Story Also: కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్: ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ ఎప్పుడంటే..!