Samsung: సామ్సంగ్కు రూ. 75 కోట్ల జరిమానా.. యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో..
Samsung: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు గురువారం..
Samsung: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు గురువారం ఏకంగా రూ. 75 కోట్ల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. సామ్సంగ్ ఆస్ట్రేలియా 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్కు చెందిన 31 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ప్రకటనలో భాగంగా సామ్సంగ్ వాటర్ ప్రూఫ్ ఫోన్లు అంటూ ప్రచారం చేసుకుంది.
అయితే తీరా మొబైల్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్సంగ్ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2019లో పలు కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల పాటు విచారణ జరిగన తర్వాత తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సంబంధిత స్మార్ట్ఫోన్లను ఉపయోగించిన యూజర్లు తమను సంప్రదించాలని సామ్సంగ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
వాటర్ రెసిస్టెంట్స్ విషయంలో యూజర్లను సామ్సంగ్ తప్పుదోవ పట్టించదన్న కారణంతో ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ACCC) సామ్సంగ్పై దావా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..