బీజేపీలో టీడీపీ ఎంపీల చేరిక వెనక బాబు హస్తం..?

కొద్దిసేపటి క్రితం నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీలో ఆ ఎంపీల చేరిక వెనక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఉందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేతో చంద్రబాబు తెగదెంపులు చేసుకుని.. ప్రచారం సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు పూర్తిగా రివర్స్ కావడంతో మరోసారి […]

బీజేపీలో టీడీపీ ఎంపీల చేరిక వెనక బాబు హస్తం..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2019 | 7:32 PM

కొద్దిసేపటి క్రితం నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీలో ఆ ఎంపీల చేరిక వెనక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఉందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేతో చంద్రబాబు తెగదెంపులు చేసుకుని.. ప్రచారం సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు పూర్తిగా రివర్స్ కావడంతో మరోసారి బీజేపీతో దోస్తీ కట్టే ప్రయత్నంలో బాబు ముందుగా ఎంపీలను పంపారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఎంతో నమ్మకమైన సుజనా చౌదరి, సీఎం రమేష్.. చేరికలో బాబు డైరెక్షన్ లోనే జరిగిందని కొందరు అంటున్నారు. ఇకపోతే ఇందులో ఎంతవరకు నిజముందో అనేది తెలియాల్సి ఉంది.