మే 23 తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతు- బుద్దా వెంకన్న
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచనలు, సలహాలతోనే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు పాలయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మే 23 తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్కు సాయిరెడ్డి శకునిలా తయారయ్యారన్నారు. మే 23 తర్వాత జగన్, విజయసాయిరెడ్డి చంచల్గూడ జైలుకు వెళ్తారని చెప్పారు. బీజేపీ దర్శకత్వంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వైసీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారని బుద్దా ఆరోపించారు. జగన్ అవినీతి కేసులో ప్రస్తుత సీఎస్ నిందితుడిగా ఉన్నారని […]
విజయవాడ: వైసీపీ నేత విజయసాయిరెడ్డి సూచనలు, సలహాలతోనే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు పాలయ్యారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మే 23 తర్వాత వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్కు సాయిరెడ్డి శకునిలా తయారయ్యారన్నారు. మే 23 తర్వాత జగన్, విజయసాయిరెడ్డి చంచల్గూడ జైలుకు వెళ్తారని చెప్పారు. బీజేపీ దర్శకత్వంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వైసీపీకు అనుకూలంగా పనిచేస్తున్నారని బుద్దా ఆరోపించారు. జగన్ అవినీతి కేసులో ప్రస్తుత సీఎస్ నిందితుడిగా ఉన్నారని విమర్శించారు.