వివేకా హత్య కేసు: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస్తుతం సిట్ బృందం విచారిస్తుండగా.. వారి విచారణలో భాగంగా ఇటీవల బీటెక్ రవికి నోటీసులు […]

వివేకా హత్య కేసు: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 12:10 PM

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే.. దీన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. కాగా ఈ కేసును ప్రస్తుతం సిట్ బృందం విచారిస్తుండగా.. వారి విచారణలో భాగంగా ఇటీవల బీటెక్ రవికి నోటీసులు అందాయి. ఈ క్రమంలో రవి, సిట్ విచారణకు సైతం హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలందరూ సీబీఐను వ్యతిరేకించారు. ఈ క్రమంలో సీబీఐను రాష్ట్రంలోకి నిషేధిస్తూ జీవో 176ను రద్దు చేశారు బాబు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోకి సీబీఐకు స్వాగతం చెప్పగా.. ఇప్పుడు పలు కేసులపై టీడీపీ నేతలు సీబీఐ విచారణ కోరడం గమనర్హం. ఆ మధ్యన వివేకా హత్యపై మాట్లాడిన చంద్రబాబు సైతం సీబీఐ విచారణను కోరిన విషయం తెలిసిందే.

కాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ.. పోస్ట్‌మార్టంలో ఆయనది హత్య అని తేలింది. దీంతో రాజకీయంగానూ ఆయన హత్య పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇక ఈ కేసుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ కేసును కొత్త సిట్ బృందానికి అప్పగించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వివేకా హత్య కేసులో నిందితులను పట్టుకోలేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో విచారణను సిట్ అధికారులు మళ్లీ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ, బీజేపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.

టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..