“సీఎం…మంత్రులకు పెట్టిన కోటా వల్లే రాష్ట్రంలో హింస”
ఆరువారాలు స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఏపి ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు సీఎం జగన్. దీంతో సోమవారం ఉదయం గవర్నర్కు వివరణ ఇచ్చారు ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్. ఇక చంద్రబాబు బ్యాక్డోర్ పాలిటిక్స్కు.. రమేష్కుమార్ రాష్ట్రాన్ని పణంగా పెట్టారని వైసీపీ ఆరోపించింది. జగన్ నియంతృత్వ పోకడలు శృతిమించాయంటున్నాయి విపక్షాలు. అటు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓవైపు ఏకగ్రీవాలు.. మరోవైపు విపక్షాల ఫిర్యాదుల మధ్య రసవత్తరంగా […]
ఆరువారాలు స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఏపి ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు సీఎం జగన్. దీంతో సోమవారం ఉదయం గవర్నర్కు వివరణ ఇచ్చారు ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్. ఇక చంద్రబాబు బ్యాక్డోర్ పాలిటిక్స్కు.. రమేష్కుమార్ రాష్ట్రాన్ని పణంగా పెట్టారని వైసీపీ ఆరోపించింది. జగన్ నియంతృత్వ పోకడలు శృతిమించాయంటున్నాయి విపక్షాలు. అటు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
ఓవైపు ఏకగ్రీవాలు.. మరోవైపు విపక్షాల ఫిర్యాదుల మధ్య రసవత్తరంగా జరుగుతున్న పోరులో.. ఆదివారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో మొత్తం సీను మారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6వారాల పాటు ఎన్నికల వాయిదాపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి పార్టీలు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయంపై మండిపడ్డారు సీఎం జగన్. పాక్షికంగా కాకుండా మొత్తం ప్రక్రియనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు.
అటు సీఎం జగన్ ఫిర్యాదు నేపథ్యంలో సోమవారం ఉదయం గవర్నర్ను కలిసి వివరణ ఇచ్చారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఎన్నికలు వాయిదా వేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేసింది ప్రభుత్వం. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ఇక సీఎం జగన్ ఉన్నతాధికారులతో పాటు.. మాజీ ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డితో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీంతో ఎన్నికల విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది.
ఏపీలో స్థానిక సంస్థల నిలిపివేతపై పొలిటికల్ పార్టీల వెర్షన్ తెలుసుకునేందుకు టీవీ9 వేదికగా మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ ‘బిగ్ న్యూస్-బిగ్ డిబేట్’ నిర్వహించారు. ఈ చర్చలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మంత్రులకు ఇన్ని సీట్లు గెలవాలని కోటా పెట్టారని, లేకపోతే మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారని..అదే హింసకు కారణమైందని పేర్కొన్నారు. గతంలో రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేవని, కానీ ప్రస్తుతం మారుమూల శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్టణం, తుర్పు గోదావరి జిల్లాలకు సైతం హింసను విస్తరించారని పేర్కొన్నారు.