వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల ధర్నా.. సంకెళ్లు, నల్ల కండువాలు ధరించి..

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీ సమీపంలో చంద్రబాబు సహా టీడీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగారు.

వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల ధర్నా.. సంకెళ్లు, నల్ల కండువాలు ధరించి..
Follow us

|

Updated on: Dec 03, 2020 | 9:10 AM

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీ సమీపంలో చంద్రబాబు సహా టీడీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగారు. అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సంకెళ్లు, నల్ల కండువాలతో బైఠాయించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ఎమ్మెల్సీ నారా లోకేష్ నిరసన తెలుపగా, టీడీపీ ప్రజాప్రతినిధులంతా కాలి నడకనే అసెంబ్లీకి బయలుదేరారు. కాగా, ధర్నా సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు హింసకు గురవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.