మన సీఎం.. ‘అక్కరకు రాని చుట్టం’ : నారా లోకేశ్
కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశామని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని వరద బాధితులకు అందించారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాలు వరద నష్టాలను ఎదుర్కొన్నాయన్న లోకేశ్… ఆయా రాష్ట్రాల సీఎంలు అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇప్పటికే […]
కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశామని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని వరద బాధితులకు అందించారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాలు వరద నష్టాలను ఎదుర్కొన్నాయన్న లోకేశ్… ఆయా రాష్ట్రాల సీఎంలు అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారని గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం ‘అక్కరకు రాని చుట్టం’లా అమెరికాలో బిజీగా ఉన్నారని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ ఏడాది దేశమంతటా అనేక రాష్ట్రాలు వరద కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించి వరదబాధితులకు అండగా నిలిచారు. pic.twitter.com/brRAIQjYj4
— Lokesh Nara (@naralokesh) August 20, 2019
ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారు. మన ముఖ్యమంత్రి మాత్రం ‘అక్కరకు రాని చుట్టం’లా అమెరికాలో సొంతపనుల్లో యమబిజీగా ఉన్నారు.#YSJaganFailedCM #JaganInUSADuringFloods
— Lokesh Nara (@naralokesh) August 20, 2019
కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేయడం జరిగింది. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20,000 లీటర్ల త్రాగునీటిని వరద బాధితులకు అందించారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చెయ్యడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.#NTRTrust #YSJaganFailedCM pic.twitter.com/6Yimr49OaN
— Lokesh Nara (@naralokesh) August 20, 2019