సెక్యులరిస్ట్గా ఉండాల్సిన బాధ్యత జగన్ పై ఉంది : జవహర్
జగన్ కు ఓట్లేసిన పాపానికి దళితులంతా లెంపలేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్. తిరుపతి పర్యటనలో పక్కన పెద్దరెడ్డిని కూర్చోపెట్టుకున్న జగన్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని నుంచోపెట్టి దళితుల పట్ల తన అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. సొంత పార్టీకి చెందిన ఎస్సీ ఎంపీ చనిపోతే కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. వేరే రెడ్డి మంత్రి ఎవరైనా చనిపోతే ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ పరామర్శించేవారు కాదా..? అని ఆయన అన్నారు. చనిపోయింది ఎస్సీనేగా అనే చులకన భావన […]
జగన్ కు ఓట్లేసిన పాపానికి దళితులంతా లెంపలేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్. తిరుపతి పర్యటనలో పక్కన పెద్దరెడ్డిని కూర్చోపెట్టుకున్న జగన్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని నుంచోపెట్టి దళితుల పట్ల తన అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. సొంత పార్టీకి చెందిన ఎస్సీ ఎంపీ చనిపోతే కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. వేరే రెడ్డి మంత్రి ఎవరైనా చనిపోతే ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ పరామర్శించేవారు కాదా..? అని ఆయన అన్నారు.
చనిపోయింది ఎస్సీనేగా అనే చులకన భావన జగన్ కు తగదన్నారు జవహర్. వైసీపీలో ఉన్న ఎస్సీ నేతలు కనీసం గళం వినిపించి జగన్ చేసేది తప్పని చెప్పాలని ఆయన కోరారు. సెక్యులరిస్ట్ గా ఉండాల్సిన బాధ్యత జగన్ పై ఉందని జవహర్ అన్నారు. డిక్లరేషన్ విషయంలో మొండిగా వెళ్లి వెంకటేశ్వరస్వామి భక్తులను అవమానించారని విమర్శించారు. మనిషిని మనిషిగా చూడటం జగన్ వదిలేశారన్న ఆయన.. జగమొండితనాన్ని తిరుపతి పర్యటనలో నిరూపించుకున్నారని ఆరోపణలు గుప్పించారు.