విజయసాయిరెడ్డిపై కొండ్రు మురళీ ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత కొండ్రు మురళీ మండిపడ్డారు. తనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి విజయసాయిరెడ్డికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో మొత్తం గుండాలు, 420 నాయకులే ఉన్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కారులో కోట్ల డబ్బు దొరికితే.. దాన్ని ఎస్పీ వెంకటరత్నం పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి ఎలా చెబుతారని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కోవడానికి విజయసాయిరెడ్డే కారణమని కొండ్రు మురళీ […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత కొండ్రు మురళీ మండిపడ్డారు. తనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి విజయసాయిరెడ్డికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో మొత్తం గుండాలు, 420 నాయకులే ఉన్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కారులో కోట్ల డబ్బు దొరికితే.. దాన్ని ఎస్పీ వెంకటరత్నం పట్టించుకోలేదని విజయసాయిరెడ్డి ఎలా చెబుతారని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇరుక్కోవడానికి విజయసాయిరెడ్డే కారణమని కొండ్రు మురళీ ఆరోపించారు.