వైసీపీ అరాచకం.. కోడెల ధ్వజం..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలపై దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల సమస్యలు పట్టించుకోవాలని హితవు పలికారు. వందలాది దాడులు, వేలాది కేసుల మాదిరిగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకుని ప్రజా సమ్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కోడెల. రాష్ట్రంలో ప్రజలకు అభద్రతా భావం వచ్చిందన్నారు. ప్రజావేదిక కూల్చివేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే.. […]
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలపై దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల సమస్యలు పట్టించుకోవాలని హితవు పలికారు. వందలాది దాడులు, వేలాది కేసుల మాదిరిగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకుని ప్రజా సమ్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కోడెల. రాష్ట్రంలో ప్రజలకు అభద్రతా భావం వచ్చిందన్నారు.
ప్రజావేదిక కూల్చివేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే.. తనపై, నా కుటుంబంపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, తనపై పెట్టిన కేసులపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలి అన్నారు. చంద్రబాబును అవమానించేలా అసెంబ్లీలో మాట్లాడుతున్నారని.. ప్రతిపక్షం ఉండకూడదని వేధిస్తే కాలమే సమాధానం చెప్తుందని అన్నారు మాజీ స్పీకర్ కోడెల.