టీడీపీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే?

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ డీలా పడిందా.? అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. ఇప్పుడు జైలు పాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైనా వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా… చంద్రబాబు కానీ పార్టీ సీనియర్లు కానీ బాధితుల్ని […]

టీడీపీ నేతలను వెంటాడుతున్న కేసులు.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2019 | 7:00 PM

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ డీలా పడిందా.? అంటే అవునంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆ జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. ఇప్పుడు జైలు పాలయ్యారు. కేసుల మీద కేసులతో చింతమనేని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు చింతమనేని అనుచరులపైనా వరుస కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొందరు మహిళా నేతలు సైతం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా… చంద్రబాబు కానీ పార్టీ సీనియర్లు కానీ బాధితుల్ని పరామర్శించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా నేతలంతా అంత యాక్టివ్‌గా లేరు. మరి కొంతమంది తాము టీడీపీ నేతలని చెప్పుకోవడానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్క చింతమనేని మాత్రమే కాదు.. ఆ జిల్లాలోని టీడీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. చింతమనేని తర్వాత నెక్ట్స్‌ లిస్ట్‌లో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేరు వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శుభమ్మదేవి స్కూల్‌ గ్రౌండ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఈ భూమిని కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలను బయటకు తీసి కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసులు తిరగతోడితే బడేటి బుజ్జి కూడా చింతమనేని చెంతకే చేరుతారని స్వయంగా జిల్లా టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. దీనితో కొందరు నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ క్యాడర్‌ అయోమయంలో పడింది. అటు వైసీపీ జిల్లాలో టీడీపీని ఖాళీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!