ప్రజావేదిక కూల్చివేతపై.. కేశినేని వర్సెస్ విజయసాయి రెడ్డి
‘ప్రజావేదిక’ కూల్చివేత ప్రతిపాదన టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధంగా మారుతోంది. ప్రజావేదికపై నిన్న డైలాగ్ వార్ నడిస్తే.. ఇవాళ సోషల్ మీడియా వార్ మొదలైంది. ప్రజావేదిక అక్రమమో.. సక్రమమో.. పక్కన పెడితే అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కృష్ణానది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించిన తర్వాతే.. అంటే చివర్లో తొలగిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ.. ఇప్పుడు తొలగిస్తే ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లుతుందని […]
‘ప్రజావేదిక’ కూల్చివేత ప్రతిపాదన టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధంగా మారుతోంది. ప్రజావేదికపై నిన్న డైలాగ్ వార్ నడిస్తే.. ఇవాళ సోషల్ మీడియా వార్ మొదలైంది.
ప్రజావేదిక అక్రమమో.. సక్రమమో.. పక్కన పెడితే అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. కృష్ణానది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించిన తర్వాతే.. అంటే చివర్లో తొలగిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ.. ఇప్పుడు తొలగిస్తే ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లుతుందని అన్నారాయన. మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చు అవుతుందని.. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించిన తర్వాతే ప్రజా వేదిక కూలిస్తే సముచితమని నాని అభిప్రాయపడ్డారు.
అయితే.. ఈ వాదనను ఖండించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. నదీగర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసే పెద్దోళ్లు కట్టుకున్న ఇళ్లను కూల్చితే తప్పేంటి అన్నారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారు.. కానీ ఇక నుంచి సాధ్యం కాదని హెచ్చరించారు. చట్ట ప్రకారమే కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉంటుందని విజయసాయి పేర్కొన్నారు.