‘ఢిల్లీ ఎన్నికల్లో నేనూ ఓటు వేశా’.. తాప్సీ పన్ను

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసేందుకు సినీ నటి తాప్సీ పన్ను ముంబై నుంచి ఈ నగరానికి చేరుకుంది.  సోదరి షాగున్ తోను, తన తలిదండ్రులతోను వచ్చిన ఆమె.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం.. ‘పన్ను పరివార్ (కుటుంబం) ఓటు వేసింది. మీరూ ఓటు వేశారా ? ఓట్ టు ఢిల్లీ.. ఎవ్వెరి ఓట్ కౌంట్స్’ అని కామెంట్ చేస్తూ.. తమ కుటుంబ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఓటింగ్ రోజుకు […]

'ఢిల్లీ ఎన్నికల్లో నేనూ ఓటు వేశా'.. తాప్సీ పన్ను
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 08, 2020 | 2:20 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు వేసేందుకు సినీ నటి తాప్సీ పన్ను ముంబై నుంచి ఈ నగరానికి చేరుకుంది.  సోదరి షాగున్ తోను, తన తలిదండ్రులతోను వచ్చిన ఆమె.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం.. ‘పన్ను పరివార్ (కుటుంబం) ఓటు వేసింది. మీరూ ఓటు వేశారా ? ఓట్ టు ఢిల్లీ.. ఎవ్వెరి ఓట్ కౌంట్స్’ అని కామెంట్ చేస్తూ.. తమ కుటుంబ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే ఈ ఓటింగ్ రోజుకు ముందు.. తల్లి, సోదరితో కలిసి   దిగిన ఫోటోలను వేర్వేరుగా పెట్టింది. మేం ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నాం అని ఆమె పేర్కొంది.  కాగా… తాప్సీ నటించిన ‘థప్పడ్’ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజయింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గృహహింస నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాకు ముందు సిన్హా, తాప్సీ ‘ ముల్క్’ మూవీకోసం కలిసి పని చేశారు.