మరణించిన ఏనుగుకు ఘనంగా వీడ్కోలు
అయినవాళ్లు దూరమైతే కనీసం చూసే పరిస్థితులు లేని ఈ రోజుల్లో ఓ ఏనుగు చనిపోతే గౌరవప్రదంగా సాగనప్పారు అటవీ అధికారులు. అనారోగ్యంతో మరణించిన ఆ ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు.
అయినవాళ్లు దూరమైతే కనీసం చూసే పరిస్థితులు లేని ఈ రోజుల్లో ఓ ఏనుగు చనిపోతే గౌరవప్రదంగా సాగనప్పారు అటవీ అధికారులు. అనారోగ్యంతో మరణించిన ఆ ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు. తమిళనాడులోని పొల్లాచిలో ఏనుగు సంరక్షణ కేంద్రానికి చెందిన కల్పన అనే 41 ఏండ్ల ఆడ ఏనుగు సోమవారం చనిపోయింది. ఈ ఏనుగు గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. వయసు మీద పడటంతో వైద్యులచేత ప్రత్యేక కూడా అందించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అధికారులతోపాటు సిబ్బంది ఈ ఏనుగుకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు కూడా చేశారు. ఏనుగు కల్పనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
Tamil Nadu: A 41-year-old female elephant, Kalpana died at Kolikamuthi Elephant Camp at Top slip in Pollachi today. The elephant was ill since last two months. Forest officials and guards paid floral tribute to her. pic.twitter.com/jL5yXry2Jm
— ANI (@ANI) September 21, 2020